వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విహెచ్ లాంటి వాళ్లని ఆ దేవుడు కూడా క్షమించడు -సబిత ఇంద్రా రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
సహజ మరణాలను కూడా వైయస్ హఠాన్మరణం తర్వాత ఆ షాక్ లో మరణించినట్టు చిత్రీకరించారని, అవన్నీ బోగస్ మరణాలని వి హనుమంత రావు చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇలా అసంబద్ధ వ్యాఖ్యలు చేసే వారిని ఆ దేవుడు కూడా క్షమించడని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య శ్రీ లాంటి పథకాల ద్వారా ప్రజలకు ఎంతో చేరువైన వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోతే దాన్ని బోగస్ అంటూ ప్రచారం చెయ్యడం అనుచితం అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా వైయస్ కు ఉన్న ప్రజాదరణ చూసి ఆయన పథకాల గురించి విమర్శిచకూడదని అనుకున్నప్పటికీ సొంత పార్టీ వారు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం దురదృష్టకరం అని అన్నారు.

ఇలా మాట్లాడే వారు గడప గడప తొక్కండి. ఒక్కో కుటుంబాన్ని అడగండి. రాష్ట్రమంతా వైయస్ ను ఎలా దేవులాగా కొలుస్తున్నారో అర్థమవుతుందని సలహా ఇచ్చారు. పార్టీ సీనియర్లు హుందాగా, ప్రయోజనకరంగా మాట్లాడాలి కానీ ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X