విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవనిగడ్డకు ముంపు ప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Avanigadda
విజయవాడ: అవనిగడ్డకు ముంపు ప్రమాదం ముంచి ఉంది. పులిగడ్డ అక్విడక్ట్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. అక్విడక్ట్ పై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. అమరావతి పూర్తిగా నీటిలో చిక్కుకుపోయింది. అమరావతి ఆలయంలోకి మాత్రం నీరు చేరలేదు. అయితే అమరావతి నుంచి గుంటూరుకు, విజయవాడకు వెళ్లే రహదారులు మూసుకుపోయాయి. కృష్ణానది ప్రవాహం పెరగడంతో గుంటూరు జిల్లాలోని కరకట్టలకు కూడా ప్రమాదంగా పరిణమించింది. అమరావతి వద్ద మద్దూరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో అక్కడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశువుల కాపరి మాత్రమే గుంటూరు జిల్లాలో మరణించాడు. ప్రాణ నష్టం అంతకు మించి జరిగిన దాఖలాలు లేవు.

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీకి 10.66 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీని నుంచి 10 లక్షల నీరు వదులుతున్నారు. దీంతో ఎడమ కరకట్టకు ప్రమాదం పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంత వరద ప్రవాహం పెరిగి స్థిరీకరణ చెందే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మరో 22, 23 గంటలు కొనసాగే అవకాశం ఉంది. కరకట్టలకు గండ్లు పడకపోతే ప్రమాదం పెద్దగా ఉండదు. అయితే గండ్లు పడతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎడమ కరకట్టకు ఏ విధమైన ప్రమాదం ఉండదని చీఫ్ డిజైన్ ఆఫీసర్ రాజు తెలిపారు. కట్టపై అధికారులు గస్తీ తిరుగుతున్నారు. కరకట్టలకు ఇసుక బస్తాలు అడ్డం వేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X