కరకట్టకు గండి: ముంచుతున్న నీరు

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లా పల్లెపాలెం గ్రామం వద్ద కృష్ణానది కరకట్టకు గండి పడింది. దీంతో కృష్ణానది జలాలు మూడు గ్రామాలను ముంచెత్తుతోంది. పల్లెపాలెం కరకట్టకు 2 మీటర్ల మేర గండి పడింది. కరకట్టకు మరమ్మతు చేసే అవకాశమే లేదని, ప్రజలు గ్రామాలను ఖాళీ చేయాల్సిందేనని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సుమారు 3 లక్షల ఎకరాల పంట నష్టం జరుగుతుంది. రేపల్లే పట్టణం, వెల్లటూరు గ్రామాలను వరద ప్రమాదం పొంచి ఉంది. పల్లెపాలెం గ్రామాన్ని మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, మోపిదేవి, పిళ్లి సుభాష్ చంద్రబోస్ సందర్శించారు. పెనుమూడి, వెల్లటూరుల మధ్య రాకపోకలు స్తంభించాయి.

హంసల దీవి వద్ద కరకట్ట బలహీనపడింది. దీనికి గండి ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే మరమ్మతుకు ఆదేశించారు. అమరావతి మండలంలోని 30 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లోని గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. కోడూరు, భట్టిప్రోలు మండలాలను కూడా వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. అమరావతిలో వరద తగ్గు ముఖం పట్టింది. అడుగు మేర నీరు తగ్గుముఖం పట్టింది. అరవిందవారథిపై నుంచి ఇంకా నీరు పారుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+