వరద సాయంపై మంత్రుల అశ్రద్ధ: బాబు

గండి పడిన కృష్ణా నది కరకట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారని, ప్రజలు ఆదుకోవడంలో అధికారులు, మంత్రులు సరిగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. ముంపునకు గురైన మహబూబ్ నగర్, కర్నూలు, కృష్ణా, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఆయన మరోసారి గురువారం పర్యటించనున్నారు. ఆయన వరద తాకిడి ప్రాంతాల్లో ఇప్పటికే ఒకసారి ఏరియల్ సర్వే నిర్వహించారు.












Click it and Unblock the Notifications