నిమ్మకు నీరెత్తినట్లున్నారు: చిరంజీవి

కర్నూలు పట్టణంలో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని నిస్సహాయ స్థితిలో అధికారులున్నారని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో లేకపోతే ఇతర జిల్లాల నుంచైనా తెప్పించే వీలు లేదా అని ఆయన అన్నారు. కర్నూలులో వరద బాధితుల స్థితి ఆందోళనకరంగా ఉందని, ఇళ్లలో బురద పేరుకుపోయిందని ఆయన అన్నారు. ఒక్క జిల్లానే ఆదుకోలేని అధికారులు రాష్ట్రాన్ని ఎలా ఆదుకుంటారని ఆయన అడిగారు. బాధితుల కోసం తెచ్చే వస్తు సామగ్రిని ఎక్కడ అందించాలో కూడా తెలియని అయోమయ స్థితి ఉందని ఆయన చెప్పారు. పరిస్థితి దారుణంగా ఉందని ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications