సహాయం సరిపోదు: చిరంజీవి

రైతులు పంటలు కోల్పోవడమే కాకుండా తదుపరి పంట వేసుకునే స్థితిలో కూడా లేరని, పొలాల్లో 20 అడుగుల మేర ఇసుక మేట వేసిందని ఆయన చెప్పారు. చేతి వృత్తుల వారికి కూడా తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉందని, వారు పూర్తిగా జీవనోపాధిని కోల్పోయారని ఆయన అన్నారు. తక్షణ సహాయం కింద కనీసం ఐదేసి రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ శాసనసభ్యులు తమ వేతనం ఇస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీ తరఫున, చిరంజీవి ట్రస్టు తరఫున విరాళాలు సేకరిస్తున్నామని, అయితే తాము ఇచ్చే సహాయం సరిపోదని, ప్రజలు కోలుకోవాలంటే ప్రభుత్వమే పెద్ద యెత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications