వరద బాధితులకు జగన్ పరామర్శ

YS Jagan
కడప: కడప జిల్లాలోని వరద బాధితులను కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మంగళవారం పరామర్శించారు. కడప జిల్లాలో వరద ముంపునకు గురైన గ్రామాలను ఆయన సందర్శించారు. రాజుపాలెం మండలంలో ఆయన పర్యటించారు. రాజుపాలెం మండలం గ్రామాల్లో పంటలు పూర్తిగా మునిగిపోవడాన్ని ఆయన చూశారు. మంగళవారం కూడా మోకాలు లోతు నీళ్లు నిలిచి ఉన్నాయి. బాధితులను ఆయన ఓదారుస్తూ, వారికి అందుతున్న సహాయాన్ని జగన్ అడిగి తెలుసుకున్నారు. టంగుటూరు గ్రామ బాధితులను కూడా అయన పరామర్శించారు.

సోమవారంనాడు ఆయన జమ్మలమడుగు, పెద్ద ముడియం మండలాల్లో పర్యటించారు. ఆయన సోమవారం ట్రాక్టర్ పై వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం కూడా అదే ట్రాక్టర్ పై ఆయన పర్యటించారు. జిల్లా కలెక్టర్, అధికారులతో పాటు శాసనసభ్యులు ఆయన వెంట ఉన్నారు. కడప జిల్లాలో దాదాపు 50 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+