వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితులను ఆదుకుంటాం: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన వరసగా మూడో రోజు బుధవారం కడప జిల్లాలోని వరద బాధితులను పరామర్శించారు. వరద తాకిడి ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు దెబ్బ తిన్నాయి. అయినా ఆయన వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ఓదారుస్తున్నారు. పుట్టిపై, ట్రాక్టర్ పై, ఎడ్ల బండిపై ఆయన ప్రయాణించి వరత తాకిడి గ్రామాలను చేరుకున్నారు. బుధవారంనాడు ఆయన చాపాడు మండలం కుందూ నది వరద ఉధృతిని పరిశీలించారు.

దువ్వూరు మండలం ఖానా గూడూరులో పసుపు పంటను పరిశీలించారు. ఆ తర్వాత నేలటూరు గ్రామాన్ని సందర్శించారు. రోడ్లు, పొలాలు పూర్తిగా నీటి మునిగిన విషయాన్ని గమనించారు. ఆ గ్రామంలోకి కూడా వెళ్లి ప్రజల సమస్యలు విన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X