కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మస్కట్ లో వేయి మంది ఆంధ్రుల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మస్కట్ లో అక్రమంగా నివాసం ఉంటున్న దాదాపు వేయి మంది తెలుగువారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వార్తాకథనాన్ని ఒక ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం నుంచి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దాడుల్లో బుధవారంనాటికి వేయి మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అక్కడివారు తమకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని ఆ టీవీ చానెల్ తెలిపింది.

అరెస్టయినవారిలో ఒక్క కరీంనగర్ జిల్లావారే 400 మంది దాకా ఉంటారు. నిజామాబాద్ కు చెందినవారు 100 నుంచి 150 మంది, ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు 300 నుంచి 400 మంది దాకా ఉంటారని అంచనా. ఇప్పటికే 1500 మంది దాకా ఆంధ్రులు మస్కట్ జైళ్లలో మగ్గుతున్నట్లు తెలుస్తోంది. తమను భారత్ కు రప్పించడానికి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకు చొరవ చూపాలని వారు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X