హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పాము కరిచి ఉంటే? చంద్రబాబు నాయుడు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: రాష్ట్ర పాలనా వ్యవస్ధ వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఎత్తి చూపారు. 'నంద్యాలలో ముఖ్యమంత్రి రోశయ్య కూర్చున్న సోఫా కింద ఆయన వెళ్లిన తర్వాత ప్రమాదకరమైన పామును కనుగొన్నారు. ప్రమాదవశాత్తు ఆయనను ఆ పాము కరిచి ఉంటే రాష్ట్రం పరువు ఏమయ్యేది? నెల క్రితం ఒక సీఎం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. మరో సీఎం ఇలాంటి ప్రమాదానికి గురైతే మనం మొహం ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చేది' అని చంద్రబాబు ప్రశ్నించారు.

మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ నేతలతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. సీఎం పర్యటనలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలనూ అధికారులు విస్మరించినట్లు కనిపిస్తోందని, ఆయన సోఫా కింద పాము బదులు బాంబు ఉన్నా పరిస్థితి ఇంతేనా అన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ మరణించిన తర్వాత కూడా అధికార యంత్రాగాన్ని మొద్దునిద్ర వీడలేదని, రోశయ్య హెలికాప్టర్‌ మట్టిలో కూరుకుపోవడం దీనికి నిదర్శనమన్నారు.

'ముఖ్యమంత్రికి సరైన భద్రత లేకపోతే అది మన రాష్ట్రం పరువును దెబ్బతీస్తుంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ పనితీరును కుప్పకూల్చారు. ఈ పరిస్థితిపై బహిరంగ చర్చ జరగాలి. ప్రజల వద్దకు వెళ్లకపోతే ఏమవుతుందిలే అన్న ధీమా వారిలో కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X