హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య తీరుపై చిరంజీవి ఆక్షేపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: వరద బాధితుల పట్ల ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యవహరించిన తీరు పట్ల ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాలతో కరాఖండిగా మాట్లాడినట్లు రోశయ్య వరద బాధితులతో మాట్లాడారని, అది సరి కాదేమే అనిపించిందని ఆయన అన్నారు. వరద బాధితులతో మాట్లాడే సమయంలో రోశయ్య సంయమనం కోల్పోతారమేనని అనిపించిందని, వారి పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించాల్సిన తీరు అది కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బాధితులకు భరోసా కల్పించాలని, భద్రతా భావం వారిలో పాదు కొల్పాలని, అయితే రోశయ్య తన పర్యటనల్లో ఆ పని చేయలేకపోయారని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పథకం వేసుకుని అత్యవసరంగా నిధులు సమీకరించుకుని వరద బాధితులకు సహాయం అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాధితులకు తగిన సహాయం అందించడంలో, పునరావాసానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టడంలో చురుగ్గా వ్యవహరించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. లోపం మంత్రులదో, ముఖ్యమంత్రిదో, అధికారులదో తెలియడం లేదని, ఈ విషయంలో సమాధానం ఇచ్చుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు. బాధితులను సమాధాన పరిచే విషయంలో కూడా రోశయ్య సరిగా వ్యవహరించలేకపోయారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X