భేటీలు: వైయస్ జగన్ వర్సెస్ రోశయ్య

కాగా, అటు రోశయ్యను బలపరుస్తున్న వర్గం కూడా క్రియాశీలకంగా మారింది. రోశయ్యను బుధవారం కాంగ్రెసు సీనియర్ నేతలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వి హనుమంతరావు కలిశారు. తాము మర్యాదపూర్వకంగానే రోశయ్యను కలిశామని, వరదలపై తాము అడిగి తెలుసుకున్నామని వారు చెప్పారు. రోశయ్యపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం తగదని హనుమంతరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి నివాసంలో తెలంగాణ సీనియర్లు బుధవారం సమావేశమయ్యారు. రోశయ్య నాయకత్వాన్ని బలపరిచే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెసి నివాసంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి, అమోస్, నర్సారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications