హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యో పాపం, జగన్ వర్గం: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామాలు చేస్తామన్న వారి గురించి అయ్యో పాపం అనుకోవాల్సే ఉంటుందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు సీనియర్లతో తన నివాసంలో భేటీ అయిన అనంతరం ఆయన బుధవారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. సీనియర్లను తాను అల్పాహార విందుకు ఆహ్వానించానని, ఇది రాజకీయ భేటీ కాదని ఆయన స్పష్టం చేశారు.

తాను జగన్ ను ముఖ్యమంత్రిని చేయకూడదని చెప్పలేదని ఆయన అన్నారు. పార్టీ నాయకులు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు ముఖ్యమంత్రి అవుతారని, తనకు పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ఆయన అన్నారు. తాను ఈ విషయంలో గోడ మీద పిల్లిలా లేనని ఆయన చెప్పారు. అధిష్ఠానం చెప్పినవారే ముఖ్యమంత్రి అవుతారనే విషయంలో భిన్నాభిప్రాయానికి తావు లేదని ఆయన అన్నారు. రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎవరూ వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాను తొలుత కోరుకున్న విషయం నిజమేనని, అయితే జగన్ ముఖ్యమంత్రిని చేయడం తన చేతుల్లో లేదని, పార్టీ అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X