హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు గ్లామర్ ఉంది: లక్ష్మీపార్వతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: ఏ పార్టీకైనా ఫేస్ వాల్యూ ఉండాలని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ లో ఆ గ్లామర్ ఉందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ ఎన్టీరామారావు భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె బుధవారంనాడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు వైయస్ సతీమణి విజయలక్ష్మిని ఆమె పరామర్శించారు. రోశయ్య అనుభవజ్ఞుడైనప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయనకు అనుభవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెసుకు స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి పునర్జన్మ ఇచ్చారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజలు నమ్మిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె అన్నారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెసు దెబ్బ తింటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X