వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ లో మరోసారి తెగబడ్డ నక్సల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Naxalites
పాట్నా: బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. రాష్ట్రంలోని షియోహార్ జిల్లా బృందాబజార్ వద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ టవర్ ను వారు బాంబులతో పేల్చివేశారు. ఒక ట్రక్కును దగ్ధం చేశారు. ఈ సంఘటనలు మంగళవారం రాత్రి జరిగాయి. దాదాపు 45 నుంచి 50 మంది నక్సలైట్లు గ్రామానికి వచ్చి ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించి ఎయిర్ టెల్ టవర్ ను పేల్చివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఆ తర్వాత ట్రక్కులో కూర్చున్న వారిని దింపేసి దానికి నిప్పంటించారు.

మావోయిస్టులు రెండు రోజుల బంద్ కు పిలువు ఇచ్చిన నేపథ్యంలో రెండో రోజు ఆ చర్యలకు పాల్పడ్డారు. మంగళవారంనాడు మావోయిస్టులు పోలింగ్ సందర్భంగా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను ముట్టడించారు కూడా. ఒరిస్సాలో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో ఇద్దరిని కాల్పి చంపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X