వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కు జగనే దిక్కు: రోజా

By Santaram
|
Google Oneindia TeluguNews

Roja
అన్నవరం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ బాధ్యతలు వైయస్ జగన్‌కు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని సినీనటి రోజా అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి సిద్ధివినాయక, అన్నవరం సత్యదేవుని ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీలో మెజారిటీ కేడర్‌ జగన్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలనే కారణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు అనుభవం ఉన్నా ప్రజల్లో తిరగలేరని, జగన్‌ కున్న ప్రజాకర్షణ వారికి లేదని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రోజా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న వెంటనే రాజశేఖరరెడ్డి మరణించడంతో పార్టీలో ఆమె చేరిక ఆలస్యమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X