జగన్ పార్టీ పెట్టరు: వివేకానంద రెడ్డి

హైదరాబాద్: వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రాంతీయ పార్టీ పెట్టబోమని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఒక తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన బుధవారం ఈ ప్రకటన చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించి, మెప్పించి జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా గవర్నరుకు లేఖను కూడా ఇవ్వబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీకి క్రౌడ్ పుల్లర్ కావాలని, ఆ క్రౌడ్ పుల్లర్ జగన్ మాత్రమేనని, అందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. తల్లిలాంటి కాంగ్రెసు పార్టీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అంగీకరిస్తుందని అనుకుంటున్నామని ఆయన అన్నారు.

పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కె.కేశవరావులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వారు సీనియర్ నాయకులు కారని, సీనియర్ సిటిజన్స్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకుని గెలవలేదని తమ పార్టీ శాసనసభ్యుడు పి. శంకరరావు అనడంపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ఫొటో పెట్టుకుని గెలిచారని వైయస్ తాను బతికున్నప్పుడు కూడా ఏనాడూ అనలేదని ఆయన అన్నారు. వైయస్ జీవించి ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా భయపడినవారు ఇప్పుడు నోరెత్తుతున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తేవాలని కలలు కన్నారని, ప్రభుత్వ పథకాలకు ఇందిరా గాంధీ, రాజీవ్ పేర్లు పెట్టారని, పార్టీని బలోపేతం చేయడానికే ప్రయత్నించారని ఆయన వివరించారు. తనకు ఒక్కే నాలిక ఉందని, విహెచ్, కెకెలకు మాదిరిగా రెండు నాలుకలు లేవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+