చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్లిపట్టు గిడ్డంగిలో మరోసారి మంటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pallipattu
చెన్నై: తమిళనాడులో పల్లిపట్టు బాణా సంచా గిడ్డంగిలో శనివారం ఉదయం మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. తమిళనాడులోని పల్లిపట్టులోని బాణాసంచా గోదాంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద యెత్తున మంటలు లేచాయి. దీంతో పోలీసులు గిడ్డంగి షట్టర్లు మూసి పరుగులు తీశారు. మంటలు పెద్ద యెత్తన వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. శుక్రావారం రాత్రి తిరవళ్లూరు జిల్లా పల్లిపట్టులో ఇదే గిడ్డంగిలో అగ్ని ప్రమాదం సంభవించి 32 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

మృతుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా దగ్ధమయ్యాయి. అది రైస్ మిల్లులో పెట్టిన హోల్ సేల్ బాణాసంచా విక్రయ దుకాణమని పోలీసు వర్గాలు చెప్పాయి. శిథిలాల కింది నుంచి 30 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని తిరుత్తాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీపావళి పర్వదినం కావడంతో వాటిని కొనడానికి పెద్ద యెత్తున రావడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. మృతుల్లో 29 మంది ఆంధ్రులని, ముగ్గురు తమిళనాడుకు చెందినవారని సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X