హైకమాండ్ నుంచి పిలుపు రాలేదు: డిఎస్
కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని తాను కలుస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఎప్పుడు ఉంటుందో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. తాను సోనియాను కలుస్తానో లేదో కూడా తెలియదని, తాను ఢిల్లీలో ఉన్నప్పుడు సోనియా అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కె.రోశయ్యను అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించవచ్చునని, సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు సమాయత్తమవుతున్నట్లు, మంత్రి వర్గ విస్తరణకు కూడా రోశయ్యకు ఫార్ములాను ఇవ్వవచ్చునని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ ఢిల్లీ యాత్ర రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
hyderabad హైదరాబాద్ congress new delhi న్యూఢిల్లీ srinivas pcc rosaiah రోశయ్య శ్రీనివాస్ పిసిసి కాంగ్రెసు
Story first published: Monday, October 26, 2009, 18:22 [IST]