గ్రేటర్ ఎన్నికలపై మంత్రివర్గం మల్లగుల్లాలు
కాగా, వైయస్సార్ అభయహస్తం కార్యక్రమాన్ని చేవెళ్ల నవంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి కె. రోశయ్య శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేశారు. ఎజెన్సీ ప్రాంతాల్లో సంచార వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సంచార వైద్య బృందాలు తిరిగి వైద్య సేవలందిస్తాయి. రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన గీత కార్మికులకు 200 రూపాయలేసి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 18 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా.
డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ప్లేట్ లెట్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఉంచుతారు. డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ చేసిన ప్రకటనపై కూడా మంత్రి వర్గంలో చర్చ జరిగినట్లు సమాచారం. అధికారులను సంప్రదించకుండా అటువంటి ప్రకటన చేయడం వల్ల సమస్య తలెత్తిందని కొంత మంది మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి సాంకేతిక కారణాలు అడ్డు వస్తున్నాయి. దీంతో వివాదం తలెత్తింది.