వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనే ఆ విషయం చెప్పారు: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

 లడగపాటి రాజగోపాల్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వైయస్ జగన్ స్వయంగా చెప్పారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాద్ధాంతం కూడదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో అందరూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు.

కొండా సురేఖ తన అభిప్రాయం మాత్రమే చెప్పారని ఆయన అన్నారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి కాకుండా గవర్నరుకు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె గవర్నరుకు సమర్పించిన లేఖ ప్రతిని ముఖ్యమంత్రికి పంపారని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రికి పంపలేదని గుర్తు చేయగా గవర్నరుకు సమర్పించడంలో తప్పు లేదని, జర్నలిస్టులు రాజీనామా లేఖను చైర్మనుకు సమర్పిస్తే సంపాదకుడికి పంపరా అని ఆయన అడిగారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. హైదరాబాద్ పై ప్రేమ ఉంటే తెరాస గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. పోటీ చేస్తే తెరాసకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా తాను చెప్తానని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినవారు తెలంగాణవారేనని, కాదని కెసిఆర్ నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. కెసిఆర్ మీడియాలో జీవిస్తున్నారని, ప్రజల్లోకి వచ్చి జీవిస్తే మంచిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X