హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు సోనియాను కలవనున్న రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ఎట్టకేలకు ముఖ్యమంత్రి రోశయ్యకు అమ్మ సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రోశయ్య రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అవుతారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు, సీఎల్పీ సమావేశం తదితర విషయాలపై ఆమెతో చర్చించనున్నారు. రోశయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి ఢిల్లీకి వెళ్లనుండటంతో రాజకీయంగా అంతటా ఆసక్తి నెలకొంది.

ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వైయస్ జగన్ తన తల్లితో పాటు సోనియాగాంధీని కలుసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు అధిష్టానవర్గానికి అనుకూలంగా ఉంటూనే మరో వైపు రాష్ట్రంలో కొంత అలజడి సృష్టించడానికి జగన్ వర్గం ప్రయత్నిస్తోంది. కేంద్రంలో సహాయ మంత్రి పదవి తీసుకోడానికి ఇష్టపడని జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X