నెల్లూరు జిల్లాలో వర్షాల వల్ల అస్తవ్యస్తం
కావలి డీవిజన్ లో వానల వల్ల ఎక్కువ నష్టం జరిగింది. పిల్లివాగు, చిప్పలేరు వాగు పొంగటంతో కావలి డివిజన్లోని నాలుగు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్లు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అల్లూరు-కావలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నెల్లూరు తీరంలో సముద్రం అల్లకల్లోలం గా తయారైంది. అలల ఎగసి పడుతున్నాయి. మత్య్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సూళ్లురుపేట, చెన్నె సరీస్సులను ఆర్టీసీ నిలిపివేసింది.
Comments
Story first published: Saturday, November 7, 2009, 12:34 [IST]