హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుతో కలిసి మాఫియాపై పోరు: కారత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakash Karat
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో కలిసి తాము మైనింగ్ మాఫియాపై పోరాటం సాగిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పారు. ఆయన బుధవారం ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తాయని ఆయన చెప్పారు.

నిత్యావసర ధరల పెరుగుదల, మైనింగ్ మాఫియా, కరవు, వరద పరిస్థితులపై ప్రతిపక్షాలు పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాయని ఆయన చెప్పారు. దేశంలో మైనింగ్ మాఫియా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై తాము గవర్నరుకు ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు చెప్పారు. చెరుకు రైతుల సమస్యలపై సిపిఎంతో కలిసి పని చేస్తామని చంద్రబాబు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X