కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా నాయకుల వక్రబుద్ధి: హరీష్ రావు

By Santaram
|
Google Oneindia TeluguNews

Harish Rao
కరీంనగర్: ఐదు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం కీలక దశ కు చేరడంతో ఆంధ్రా నాయకుల వక్రబుద్ధి బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా సిద్దిపేటలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కెసిఅర్ ఆమరణ నిరాహార దీక్షకు తేదీ ప్రకటించడంతో ఆంధ్రానాయకులు తె లంగాణపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు.

స్వాతంత్య్రం కోసం ఆనాడు గాంధీజీ కూడా నిరాహార దీక్ష చేశారని, మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయేందుకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయలేదా! అని గుర్తుచేశారు. చివరికి ఎన్టీఆర్‌, వైఎస్సార్‌లు కూడా నిరాహార దీక్షలు చేశారు, అప్పుడు వారిపై కేసులు పెట్టాలన్న ఆలోచన ఆంధ్రా నాయకులకు ఎందుకు రాలేదని ప్ర శ్నించారు.

కెసిఅర్ మీద కోర్టులో కేసు వేస్తామని కొందరు న్యాయవాదులు, టీజీ వెంకటేశ్‌ తదిత రులు మాట్లాడటంవల్ల వారి వక్రబుద్ధి బయట ప డిందన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకునేందు కు కుటిల ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.

కెసిఅర్పై అంత ప్రేమ ఉంటే 610 జీవో అమలుకు సానుకూలత ప్రకటించాలని, హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశా రు. తెలంగాణ ఉద్యమకారులను కవ్వించకండి, రెచ్చగొట్టకండి అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రనాయకులు చిల్లర ప్రయత్నాలు మానుకోవాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X