హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అమ్ముడుపోయారు: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలకు అమ్ముడుపోయారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తన గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరం బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై ఆయన తన ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లరిగేలా తిరిగారని ఆయన అన్నారు. చంద్రబాబు గురించి చెప్పాల్సి వస్తే ఎంతైనా చెప్పవచ్చునని ఆయన అన్నారు. మాటకు కట్టుబడని మనిషి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబే అని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనారోగ్యం పాలయితే అప్పుల పాలు కావడమేనని, ఈ రోజు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేసింది చాలా తక్కువ అని, ఆ నిధులు కూడా పచ్చా చొక్కాలవారి జేబుల్లోకి వెళ్లాయని ఆయన అన్నారు.

రాజకీయాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడిని చూపించాలని ఆయన అన్నారు. నాన్న లేకుండా తాను ఇలా మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం చంద్రబాబు ఊహల్లోనైనా లేదని ఆయన అన్నారు. మాట కోసం నిలబడిన నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు. మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని, అటువంటి నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబివృద్ధి కోసం వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X