చంద్రబాబుకు ఓటమి భయం: రోశయ్య

ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఆరోపణలు వచ్చిన తర్వాత తానే సీబీఐ విచారణకు ఆదేశించినట్టు రోశయ్య తెలిపారు. తనను గాలి జనార్దనరెడ్డి జీతగాడుగా అభివర్ణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీతగాడుగా పనిచేస్తే ఓబుళాపురం గనులపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తానని ఆయన ప్రశ్నించారు. బాబు పాలనపై అప్పట్లో భాజపా... తదితర రాజకీయపక్షాలు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. అవినీతిపై చర్చకు ఎప్పుడూ సిద్దమేనని ఆయన అన్నారు. 1951నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ఎదిగానే తప్ప ఇతర మార్గాల ద్వారాతాను అధికారంలోకి రాలేదన్నారు.












Click it and Unblock the Notifications