హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటేసిన బాలకృష్ణ, నాగార్జున

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తన సతీసమేతంగా వచ్చి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, నాగార్జున తన భార్య అమలతో వచ్చి ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగార్జున కోరారు. మన నాయకులను మనమే ఎన్నుకోవాలని, అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయడం అవసరమని ఆయన అన్నారు. సినీ ప్రముఖులు కీరవాణి తదితరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మాజీ డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, డిజిపి గిరీష్ కుమార్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని గిరీష్ కుమార్ చెప్పారు. హైదరాబాదులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రామంతాపూర్ లో డబ్బులు పంచుతున్నారంటూ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఘెరావ్ చేశారు. పటాన్ చెరులో ప్రచారం చేస్తున్న కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X