ఓటేసిన బాలకృష్ణ, నాగార్జున
సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మాజీ డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, డిజిపి గిరీష్ కుమార్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని గిరీష్ కుమార్ చెప్పారు. హైదరాబాదులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రామంతాపూర్ లో డబ్బులు పంచుతున్నారంటూ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఘెరావ్ చేశారు. పటాన్ చెరులో ప్రచారం చేస్తున్న కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
nagarjuna నాగార్జున hyderabad హైదరాబాద్ balakrishna బాలకృష్ణ jubilee hills amala greater hyderabad గ్రేటర్ హైదరాబాద్ అమల వోటింగ్ voting
Story first published: Monday, November 23, 2009, 9:38 [IST]