హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అయితేనే మంచిది: రవీంద్రనాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindranath Reddy
హైదరాబాద్: పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను పోటీకి దించితేనే మంచిదని కడప మేయర్, వైయస్ బావ మరిది రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ ను పోటీకి దించితే రాష్టానికి, జిల్లాకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు. పులివెందుల నుంచి పోటీకి తన సోదరి, వైయస్ సతీమణి విజయలక్ష్మి విముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వైయస్ తప్ప విజయలక్ష్మికి మరో ప్రపంచం లేదని, అందువల్ల వైయస్ లేని శాసనసభకు వెళ్లడానికి విజయలక్ష్మి ఇష్టపడకపోవచ్చునని ఆయన అన్నారు.

పులివెందుల అభ్యర్థి విషయంలో తమ కుటుంబం కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తామని ఆయన చెప్పారు. తమ కుటుంబమంతా ఒకే మాట ఉంటుందని ఆయన అన్నారు. జగన్ అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తారని ప్రజలు అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ సతీమణి విజయలక్ష్మి పేరును పులివెందుల నియోజకవర్గానికి అధిష్టానం ఖరారు చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X