తెలంగాణపై కాంగ్రెసు ఒక్కటే చేయలేదు: రోశయ్య

తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ తీవ్రంగానే తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఉద్యమాలు చేసుకోవచ్చునని, అయితే అవి శాంతియుతంగా సాగాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశం సోనియా పరిధిలో ఉందని, సోనియా పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై కెసిఆర్ ఉద్యమాన్ని కాంగ్రెసు అధిష్టానం దృష్టికి తీసికెళ్తానని ఆయన చెప్పారు. తెలంగాణపై సోనియా నిర్ణయానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎవరి ప్రాణాలకు కూడా హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications