ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో రైలు బోగీలకు నిప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Train Bogies
హైదరాబాద్: హైదరాబాదులోని కాచిగూడా రైల్వే స్టేషనులో ఆగి ఉన్న రైలు బోగీలకు దుండగులు నిప్పు పెట్టారు. రెండు బోగీలకు వారు నిప్పు అంటించారు. పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల పనేనా, లేదా అనేది తెలియడం లేదు. హైదరాబాదులోని అమీర్ పేటలో గల చర్మాస్ పై కూడా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 11 సంఘటనలు జరిగాయి.

అన్ని సంఘటనలకు తెరాస కార్యకర్తలు బాధ్యులు కాకపోవచ్చునని పోలీసులంటున్నారు. వీటిలో ఆరు సంఘటనలతో తెరాస కార్యకర్తలకు సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కాగా, కరీంనగర్ జిల్లాలోని వీణవంక తాహిశీల్దార్ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X