హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కె చంద్రశేఖర రావు దీక్ష కొనసాగుతోంది: జయశంకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayashankar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన దీక్షను కొనసాగిస్తున్నారని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైయస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారు. కెసిఆర్ చాలా నీరసంగా ఉన్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఆర్ కు సెలైన్ ఎక్కించారని, అయితే నోటి ద్వారా కెసిఆర్ ఏమీ తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారని, నివేదికలు ఇంకా రాలేదని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రాణత్యాగాలు చేయవద్దని ఆయన కోరారు.

కెసిఆర్ మాట్లాడలేని స్థితిలో లేరని మాజీ మంత్రి, తెరాస నాయకుడు ఎ. చంద్రశేఖర్ చెప్పారు. కెసిఆర్ బొక్కలగూడులా ఉన్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ ను చూసి బయటకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్ శరీరంలోని వివిధ భాగాలు చెడిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా చూడాలని వైద్యులను కోరామని ఆయన చెప్పారు. కెసిఆర్ కు ఏమైనా అయితే తెలంగాణ భగ్గుమంటుందని తెరాస నాయకుడు లక్ష్మారెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X