వైయస్ జగన్ కు పదవి ఇవ్వాలి: కొండా సురేఖ
ప్రజాదరణ కలిగిన నాయకుడికి పగ్గాలు అప్పగిస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. ప్రజాదరణ గల నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని, ప్రజాదరణ గల నాయకుడు లేకపోవడం వల్లనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని సురేఖ అన్నారు. ఏదో పదవి అప్పగించి రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటించేలా చర్యలు తీసుకోవాలని ఆమె పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.
Story first published: Thursday, December 3, 2009, 13:35 [IST]