కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు పదవి ఇవ్వాలి: కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు రాష్ట్రంలో ఉన్నతమైన పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ పార్టీ అధిష్టానాన్ని కోరారు. జగన్ కు రాష్ట్రంలో ఉన్నతమైన పదవి ఇస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీని ఏకతాటిపై నడిపే నాయకుడు లేకుండా పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాదరణ కలిగిన నాయకుడికి పగ్గాలు అప్పగిస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. ప్రజాదరణ గల నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని, ప్రజాదరణ గల నాయకుడు లేకపోవడం వల్లనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని సురేఖ అన్నారు. ఏదో పదవి అప్పగించి రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటించేలా చర్యలు తీసుకోవాలని ఆమె పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X