హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ రాజీనామా చేయాలి: ఈటెల రాజేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Etala Rajendar
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె రోశయ్య తెలంగాణ వ్యాఖ్యలకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రాజీనామా చేయాలని తెరాస డిమాండ్ చేసింది. పార్టీ పోలిట్ బ్యూరో అత్యవసర సమావేశం అనంతరం తెరాస నాయకులు ఈటెల రాజేందర్, ఎ. చంద్రశేఖర్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంత జరిగిన తర్వాత తెలంగాణ అంశం సోనియా చేతుల్లో ఉందని రోశయ్య ప్రకటించడం మూర్ఖత్వమని, మహిళా బిల్లుతో తెలంగాణను పోల్చడం హాస్యాస్పదమని ఈటెల రాజేందర్ అన్నారు. రోశయ్య ప్రకటనలు చూసిన తర్వాతనైనా డిఎస్ రాజీనామా చేసి తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ కోసం పట్టుబడితే రోశయ్య ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని, అందుకు తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు పూనుకోవాలని ఆయన అన్నారు. పార్టీ టికెట్లు ఇచ్చినప్పటికీ తెలంగాణ శాసనసభ్యులు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచారని, అందువల్ల వాళ్లు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని ఆయన అన్నారు.

తాము ఎల్లుండి అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం సరి కాదని, రేషం ఉంటే వారు రోశయ్యపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. నలబై దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలు ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలంగాణ విముక్తికి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఐదు రోజులుగా తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంటే, విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తుంటే రోశయ్య అంతా సవ్యంగా ఉందని చెప్పడం సరి కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X