హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు ఆంధ్రా నేతలు సానుకూలమే: బొత్సా సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Bosta Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు, ఆంధ్రా కాంగ్రెసు నాయకులు తెలంగాణకు వ్యతిరేకం కాదని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమస్య పరిష్కారానికి పెద్దలంతా ఏదో ఒక ఆలోచన చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎవరికి నష్టం జరిగినా మంచిది కాదని, కుటుంబంలోని సభ్యులకు నష్టం జరిగినట్లేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను సమస్య పరిష్కారం కోసం పనిచేయడం లేదని ఎవరన్నారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రస్తుత సమస్యకు ఒక పరిష్కారం లభించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కెసిఆర్ హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని అంటున్నారని, అది జరుగుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ కు నష్టం జరిగినా, మరెవరికైనా నష్టం జరిగినా మంచిది కాదని ఆయన అన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దీక్షలు, ఆందోళనలు సరి కావని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X