హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రం పరువు పోయింది: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం పరువు పోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం వల్ల ప్రజల్లో ఉద్రేకాలు చోటు చేసుకున్నాయని, అందుకు కాంగ్రెసు పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్లనే అన్ని పార్టీల్లో సంక్షోభం తలెత్తిందని ఆయన అన్నారు.

తెలంగాణ తీర్మానం పెడితే తాము సమర్థిస్తామని చెప్పామని, అయితే విధివిధానాలు లేకుండా చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్న తీరు తమకు అభ్యంతకరమని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులు ఎంత చెప్పినా వినడం లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రపై తాము పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X