వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దీక్ష, ఒత్తిళ్ళ వల్లనే ఆ ప్రకటన: ఎఐసిసి

By Santaram
|
Google Oneindia TeluguNews

AICC
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు దీక్ష, వత్తిళ్ల కారణంగానే తెలంగాణపై ప్రకటన చేశామని ఏఐసిసి అధికార ప్రతినిధి షకీల్‌ అహ్మద్‌ చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధికోసం కోసం తలెత్తే ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను అంగీకరించేది లేదన్నారు. నిజమైన అవసరం ఉంటేనే అంగీకరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. అయితే శాసనసభ నుంచి ప్రత్యేక రాష్ట్ర తీర్మానం కేంద్రానికి అందవలసి ఉందని ఆయన చెప్పారు.

అయితే అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడితే అది వీగిపోతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కింది స్ధాయి అధికార ప్రతినిధులతో స్టేట్ మెంట్ ఇప్పించి కాంగ్రెస్ అధిష్టానవర్గం చోద్యం చూస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X