వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ తీర్మానం అవసరం: పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందుకు తగిన తీర్మానాన్ని శాసనసభలో ప్రతిపాదించాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేశారని, అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే తెలంగాణపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రక్రియకు వ్యతిరేకంగా చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని ఆమె శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు సూచించారు.

అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే తెలంగాణపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు బొత్సా ఝాన్సీ అన్నారు. రాష్ట్రాల విభజన అనేది శాసనసభ తీర్మానాలతోనో, రెండో ఎస్సార్సీతోనో ముడిబడి ఉందని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X