వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచివ్వడానికి బర్త్ డే కేకా?: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: రాష్ట్రాన్ని పంచివ్వడానికి ఇదేమైనా బర్త్ డే కేకా అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి తన ఉద్యమాన్ని ఆయన శుక్రవారం తిరుపతి నుంచి ప్రారంభించారు. తెలంగాణ నుంచి నలుగురు ముఖ్యమంత్రులు, ఒకరు ప్రధాని అయ్యారని ఆయన చెప్పారు. వాళ్లు తెలంగాణను అభివృద్ధి చేస్తామంటే ఎవరైనా వద్దన్నారా అని ఆయన అడిగారు. తెలంగాణ వ్యక్తి ప్రధాని కావడానికి రాయలసీమ ప్రజలు ఓట్లు వెసి గెలిపించారని ఆయన నంద్యాల నుంచి పివి నరసింహారావును గెలిపించడాన్ని ఉద్దేశించి అన్నారు. వేర్పాటు ఉద్యమంతో తెలంగాణ ప్రజలను రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

డబ్బులు తీసుకుని సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని, ప్రజల వెంట నాయకులు నడుస్తున్నారని ఆయన చెప్పారు. ఉద్యమాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన అన్నారు. సమైక్య భావన నివురు గప్పిన నిప్పులాంటిదని, అది ఉవ్వెత్తున ఎగిసి పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X