వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను అందరివాడిని: విశాఖలో చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: తాను అందరివాడినని, అందుకే మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు సమైక్యాంధ్రప్రదేశ్ కు కట్టుబడి ముందుకు వచ్చానని ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన శనివారం విశాఖపట్నంలోని గాజువాకలో రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భఁగా తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం అంత బలంగా లేదని ఆయన అన్నారు. అందరి కోసం తాను సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమం బలంగా లేదని, దాన్ని కొంత మంది స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. అన్ని పార్టీలవారు సమైక్యాంధ్ర కోసం నిలపడుతున్నారని ఆయన అన్నారు. కొందరు స్వార్థపరులైన వేర్పాటువాదుల వల్లనే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. 2004లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని, ప్రస్తుత సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన శుక్రవారం తిరుపతిలో పర్యటించి సాయంత్రం చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి ఆయన శనివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X