వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీక్షా స్థలి వద్ద 108లో లగడపాటికి చికిత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు వైద్యులు దీక్షా స్థలి వద్ద 108 వాహనంలో చికిత్స అందిస్తున్నారు. తనను దీక్షా స్థలి వద్దకు గానీ హైదరాబాదులోని నిమ్స్ కు గానీ మార్చాలని లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. అప్పుడే తాను చికిత్స తీసుకుంటానని ఆయన చెప్పారు. దీంతో లగడపాటి రాజగోపాల్ ను దీక్షా స్థలికి తరలించి చికిత్స చేస్తున్నారు.

లగడపాటి రాజగోపాల్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం లగడపాటి ఆరోగ్యం బాగా లేదని మాజీ శాసనసభ్యుడు జయప్రకాష్ పటిషన్ వేశారు. లగడపాటి రాజగోపాల్ ను హైదరాబాదులోని నిమ్స్ కు తరలించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. లగడపాటి వద్దకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X