వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యతో కెవిపి రామచందర్ రావు భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యతో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు శుక్రవారం సచివాలయంలో బేటీ అయ్యారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటనపై స్పష్టత కావాలంటూ తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరుంది. తాజా పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, రోశయ్యను శుక్రవారం ఉదయం కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురువల్లి జనార్దన్ రెడ్డి కూడా కలిశారు. విజయవాడ కాంగ్రెసు లోకసభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రోశయ్యతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి వట్టి వసంతకుమార్, తెలంగాణకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ చీఫ్ విఫ్ మల్లు భట్టి విక్రమార్క, సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీల జెఎసి కన్వీనర్ శైలజానాథ్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X