వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ మంత్రుల రాజీనామా
కాగా, రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి వారికి సూచించారు. రాజీనామాలు చేయడానికి ముందు వారు ముఖ్యమంత్రిని కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే వారు ముఖ్యమంత్రి సలహాను వినలేదు. శుక్రవారం ఉదయం పది గంటలకు వారు మరోసారి ముఖ్యమంత్రి రోశయ్యను కలవనున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మధు యాష్కీ తాము లాబీయింగ్ చేయదలుచుకులేదని, పోరాటం ద్వారానే తెలంగాణ సాధించుకుంటామని అన్నారు.
Comments
Story first published: Friday, December 25, 2009, 9:11 [IST]