వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థి గర్జన: పోటెత్తిన ఉస్మానియా
తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నెల 5వ తేదీననే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీల కార్యాలయాలు కూల్చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. చర్చలు అక్కర్లేదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు. గుజ్జర్ల తరహా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 5వ తేదీన రైలు రోకోకు, రాస్తా రోకోకు పిలుపునిచ్చారు. కోస్తాంధ్ర, రాయలసీమల నుంచి వచ్చే వాహనాలను, రైళ్లను అడ్డుకోవాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించకపోతే సంక్రాంతికి వెళ్లిన సీమాంధ్రులను తిరిగి రానివ్వబోమని హెచ్చరించారు.
Comments
Story first published: Monday, January 4, 2010, 9:14 [IST]