వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిదంబరంపై యనమల తీవ్ర అసంతృప్తి
రాష్ట్ర విభజనకు నిర్దిష్ట కాలపరిమితిని పెట్టాలని తెలుగుదేశం తెలంగాణ ప్రతినిధి రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. మూడు పార్టీలు మాత్రమే స్పష్టమైన వైఖరి ప్రకటించలేదనేది నిజం కాదని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ నేత చంద్రబాబు శాసనసభలో చెప్పారని, అఖిల పక్ష సమావేశంలో కూడా చెప్పామని ఆయన వివరించారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పార్లమెంటులో ఎప్పుడు పెడతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Story first published: Tuesday, January 5, 2010, 16:27 [IST]