కాంగ్రెసు తెలంగాణ వైఖరి చెప్పాలి: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణపై తన వైఖరి స్పష్టం చేయాలని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెసు ముఖ్య నాయకులను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పిలిపించుకుని చెప్పిన మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై గట్టిగా మాట్లాడలేకపోయారని, తెలంగాణ కావాలని స్పష్టంగా చెప్పలేకపోయారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు తమ రాజీనామాలను స్పీకర్ కు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణపై కాలయాపన కూడదని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అంగీకరించకపోతే మరెంత మంది ప్రాణాలు పోతాయో ఆలోచించాలని ఆయన సూచించారు. తెలంగాణపై స్పష్టతకు కాంగ్రెసు వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

శాంతియుతంగా ఆందోళనలు చేయాలని, ప్రాణ త్యాగాలు చేసుకోవద్దని నాగం విద్యార్థులను కోరారు. అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్దిష్ట కాలపరిమితి పెట్టి ప్రకటన చేయాలని తాము కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని డిమాండ్ చేసినట్లు తెలుగుదేశం మరో తెలంగాణ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. తమను ఢిల్లీ అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలిపించారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. శాంతికి పిలుపునిస్తూ అఖిల పక్ష ప్రకటనపై సంతకం చేయడానికి తాను తొలుత నిరాకరించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఆ ప్రకటనకు తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషించారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+