వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర ప్రజలకు సోనియా శాంతి పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజ్ఞప్తి చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ద్వారా ఆమె ప్రజలకు ఈ విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ గురువారం ఉదయం సోనియాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి తాను సోనియాకు వివరించినట్లు ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, ప్రభుత్వ పనితీరుపై తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై కమిటీ వేసే విషయం సోనియాతో చర్చల్లో ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సోనియా చెప్పారని ఆయన అన్నారు. కాగా, డిఎస్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తదితర నేతలను కలిసే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X