ఎస్సై హత్యకేసులో దర్యాప్తులో ప్రగతి, అరెస్టులు

Tamil Nadu
తిరునల్వేలి : తమిళనాడులో దుండగుల చేతిలో దారుణహత్యకు గురైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెట్రివేల్‌ హత్య కేసులో ముగ్గురి నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న శివసుబ్రమణ్యం కూడా వెట్రివేల్‌ను పోలివుంటాడు. దుండగులు వెట్రివేల్‌ను శివసుబ్రమణ్యంగా భావించి బాంబులు వేయడంతో వేల్‌ చనిపోయారు. ఆయనపై బాంబులు వేసిన వారిలో ముగ్గుర్ని అరెస్టు చేశామని రాష్ట్ర అదనపు డీజీపిరాధాకృష్ణన్‌ తెలిపారు.

చెన్నైలో టీనగర్‌ ఫ్లవర్‌ బజార్‌ ప్రాంతాలలోని నలుగురు పోలీసు డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. చెన్నై టీనగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సంపత్‌ కుమార్‌, రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. చెన్నై టీనగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సంపత్‌ కుమార్‌, రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడున్న పన్నీర్‌ సెల్వం దక్షిణ చెన్నై ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. దక్షిణ చెన్నై డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న షణ్ముగ వేల్‌, ఫ్లవర్‌ బజార్‌ డిప్యూటీ కమిషనర్‌గా, ఫ్లవర్‌ బజార్‌ డిప్యూటీ కమిషనర్‌ పెరియప్పా, టీనగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈమేరకు హోం శాఖ కార్యదర్శి మాలతి ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+