వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్యూనిస్టు నేత జ్యోతిబసు అవయవాలు పరిశోధనకు

By Santaram
|
Google Oneindia TeluguNews

Jyoti Basu
కోల్‌కతా: వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తన అవయవాలను దానం చేస్తున్నట్లు జ్యోతిబసు గతంలోనే ప్రకటించారు. చికిత్సపొందుతూ బసు మృతిచెందటంతో ఆయన అవయవాలను ఏఎంఆర్‌ఐ ఆసుపత్రికి అప్పగించనున్నారు. మంగళవారం కోల్‌కతాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తరుపున ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ బసు అంత్యక్రియలకు హాజరౌతారు.

హైదరాబాద్: భూసంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప పాలనాదక్షకుడు సీపీఎం నేత జ్యోతిబసు అని ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ హైదరాబాద్ లో పేర్కొన్నారు. ఆధునిక భారత రాజకీయాల్లో జ్యోతిబసు అధ్యాయం చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. జ్యోతిబసు మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటన్నారు. తొలిసారిగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి, ఎన్నికలు నిర్వహించి పంచాయతీరాజ్‌ వ్యవస్థకు జీవం పోశారన్నారు. రైతుకూలీలు, కార్మికుల సంక్షేమం కోసం జ్యోతిబసు చేసిన కృషి ఆదర్శనీయమని కొనియాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X