"ద్రౌపది" ని చదవని వారే విమర్శిస్తున్నారు: యార్లగడ్డ

Yarlagadda Lakshmiprasad
విశాఖపట్నం: ద్రౌపది పుస్తకాలను తగులబెట్టడం సంస్కారవంతమైన చర్యకాదని ఆ పుస్తక రచయిత, హిందీ అకాడమీ ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లక్రితం రాసిన ఈ పరిశోధక పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన తర్వాతే రగడ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారని ఆయన విశాఖలో అన్నారు.

ఏడాదిన్నర క్రితమే ఈ పుస్తకం రష్యన్‌, హిందీభాషల్లోకి తర్జుమా అయిందని వెల్లడించారు. ద్రౌపది మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఈ నవలను అక్కడి ప్రజలు చదివి ఎంతో సంతోషిస్తే, అస్సలు పుస్తకం చదవని వ్యక్తులే తనపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ద్రౌపది గత రెండు జన్మల్లో శారీరక సుఖం పొందలేదని, శివుడి వరంతో ఆమెకు ఆ తర్వాత జన్మలో ఐదుగురు భర్తలు లభించారని యార్లగడ్ద రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+